వినడానికి వింతగా ఉండే ఘటన ఇది. ఫేస్బుక్లో ఓ బాలుడితో ఓ మహిళ పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత అతన్ని ఓ హోటల్కి పిలిపించి శృంగారంలో పాల్గొంది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఓ వ్యక్తి రేప్కు పాల్పడ్డాడంటూ అని అతని మీద కంప్లైంట్ ఇచ్చింది. దాంతో ఆ బాలుడు షాక్ అయ్యాడు. ఆ బాలుడు తిరిగి ఆమెపై కేసు పెట్టాడు. వినడానికి సినిమా కథల ఉన్నా ఇది నిజంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 17 ఏళ్ల బాలుడు నిత్యం ఫేస్బుక్లోనే కాలక్షేపం చేస్తూ ‘జిందా’ పేరుతో ఉన్న 26 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది.
రోజు చాటింగ్ చేసుకోవడంతో వీరి మధ్య పరిచయం మరింత పెరిగింది. ఆయితే ఆ మహిళ తనతో ఓ రోజు ఏకాంతంగా గడపడానికి ఓ హోటల్కి పిలిచింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో ఇద్దరూ కలిశారు. ముందుగానే బుక్ చేసుకున్న బెడ్రూంలోకెళ్ళి.. శృంగారంలో పాల్గొన్నారు. అంతా ముగిసిన అనంతరం బాలుడికి తెలియకుండా ఆ మహిళ పోలీసులకు ఫోన్ చేసి, తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. దాంతో.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు సడెన్ గా రావడంతో ఆ బాలుడు షాక్ అయ్యాడు. అనంతరం తేరుకొని.. ఆ మహిళపై రివర్స్లో కేసు పెట్టాడు. తన తో ఏకాంతంగా గడిపేందుకు ఆమె నన్ను పిలిచింది అని లైంగిక సంబంధం కోసం బలవంతం చేయడంతోనే తాను అంగీకరించానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఏం చేయలో అర్ధం కానీ పోలీసులు ఇద్దరి పైనా కేసులు పెట్టారు. బాలుడిపై ‘అత్యాచారం’ కేసు, యువతిపై ‘పోస్కో’ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. హనీ ట్రాపింగ్లో భాగంగా ఇదంతా జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Related