దంతాలను ఎంత క్లీన్ చేసినా.. నాలుకను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా.. చాలా మందిని వేధించే సమస్య నోటి దుర్వాసన. ఈ సమస్య వల్ల చాలా మంది నలుగురిలో మాట్లాడలేకపోతుంటారు. ముఖ్యంగా ఈ సమస్యను లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎదుటివారికి మాత్రం చాలా ఇబ్బందినే కలిగిస్తుంటుంది. దాంతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు.
నాలుకపై, పళ్లపై బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్లే దుర్వాసన వస్తుంది. అయితే ఈ నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి చాలా మంది మౌత్ వాష్ లను వాడుతుంటారు. మరికొంతమందేమో.. ఉప్పునీటితో పుకిలిస్తుంటారు. ఇలాంటి చిట్కాల ద్వారా కొందరు దర్వాస నుంచి ఉపశమనం పొందుతున్నారు. కానీ మరికొందరికి సమస్య తగ్గదు.
అయితే ఈ చిట్కాలతో కూడా దుర్వాసన పోకుంటే ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. ఎవరి నోటి నుంచి అయితే కుళ్లిపోయిన పండ్ల వాసన వస్తుందో వారు డయాబెటిస్ వ్యాధి గ్రస్తులని సూచిస్తుందట. అలాగే కుళ్లిపోయిన కోడిగుడ్ల వాసన వచ్చినట్టైతే.. వారు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ దుర్వాసనను పోగొట్టడానికి కిళ్లీలను, వక్కాలను నమలకూడదని సూచిస్తున్నారు.
దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు
కరోనా.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవ్: హైదరాబాద్ పోలీసులు
ఎముకల బలంకోసం వీటిని తినాల్సిందే!