ఒకరు.. ఇద్దరు.. కాదు.. ఏకంగా 5000 వేల మంది బాలికలను ఆ దంపతులు వ్యభిచార రొంపిలోకి దించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన అఫాఖ్ హుస్సేన్, సారియా బేగం దంపతులు ఐదువేల మంది బాలికలను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపారు. ఈ దంపతులను గతంలో బాలికలతో వ్యభిచారం చేయించిన కేసుల్లో చాలా సార్లు పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ జీబీ రోడ్డులోని రెడ్ లైట్ ప్రాంతం నుంచి 16 ఏళ్ల బాలికకు పశ్చిమబెంగాల్ పోలీసులు విముక్తి కల్పించగా హుస్సేన్, సారియా బేగం దంపతుల బాగోతం బట్టబయలైంది.
ఈ దంపతులపై పోలీసులు ఏకంగా 3,895 పేజీల చార్జీషీటు కోర్టుకు సమర్పించారంటే వీరి భాగోతం ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఈ వ్యభిచార రొంపు ద్వారా ఈ దంపతులు రూ.246 కోట్ల రూపాయల విలువగల 18 స్థిరాస్తులను సంపాదించినట్టు పోలీసుల విచారణలో తెలింది. వీరు ఓ బాలికతో వ్యభిచారం చేయిస్తుండగా ఆమె విటుడి ఫోన్ నుంచి తన తండ్రికి ఫోన్ చేసింది. చివరకు పోలీసులు తీగ లాగగా డొంక అంతా కదిలింది. ఈ దంపతులకు ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో ఓ అతిథి గృహంతోపాటు పాఠశాల ఉందని పోలీసుల విచారణలో తేలింది. వీరికి ఆడితోపాటు ఆరు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయని వెల్లడైంది. బెంగళూరు నగరంలో కూడా వీరికి నాలుగుకోట్లరూపాయల విలువగల భవనం ఉండగా దాన్ని ఇటీవల విక్రయించారని తేలింది. ఢిల్లీ కేంద్రంగా సెక్స్ రాకెట్ ను ఈ దంపతులు నడిపించారని పోలీసులు తేల్చి వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
{youtube}vLKkQmkIbm8{/youtube}
Related