చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. పంచభక్ష పరమాన్నం పెట్టినా పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార పదార్థాలలో దీనిని ‘ఆమృతం’తో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణాహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి ఈ విషయాలు తెలిస్తే .. ఇష్టం లేనివారుసైతం తప్పక పెరుగు తింటారు.
పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు. నిజానికి పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినడం వల్ల ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు.
-మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది.
-నిద్రపట్టని వారికి పెరుగు ఒక వరం. ఆయుర్వేదంలో గేదె పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని చెబుతారు.
-చర్మవ్యాధులు, చర్మ కాంతులకు పెరుగు, మజ్జిగ అమోఘంగా పనిచేస్తుందని అంటారు.
జలుబు ఉంటే పెరుగు తినకూడదు అంటారు.. కానీ జలుబుకు పెరుగు విరుగుడు.
-మూత్ర సంబంధ రోగాలకు, జిగురు విరేచనాలకు పెరుగు ఉత్తమం.
-జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండేవాళ్ళకు పెరుగు అమృతం వంటిది.
-పెరుగు రెగ్యులర్ గా తీసుకుంటే ఎపెండిసైటిస్ రాదు.
-కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషధం. కామెర్లు వచ్చిన వారికి పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.
‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !