Friday, March 29, 2024
- Advertisement -

పూరి ప్రేమ కథ గురించి ఎవరికి తెలియని నిజాలు..!

- Advertisement -

కొన్నిసార్లు సినిమాల్లో చూపించినట్లుగానే నిజ జీవితంలో కూడా కొన్ని జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన కథలే సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రేమ కథలో కూడా సినిమాకు మించిన నాటకీయత ఉంది. ప్రేమ కథలను తన కోణంలో డిఫరెంట్ గా చుపించే పూరి జగన్నాథ్ ప్రేమ కథను చూస్తే.. ఆయన సినిమాల్లో కనిపించే ప్రేమ కథలకు ప్రేరణ అనిపిస్తుంది. పూరి జగన్నాద్ తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఈ ప్రేమ పెళ్లి ఎలా జరిగింది అనేది చాలా మందికి తెలియదు. ఈ ప్రేమ పెళ్లి వెనుక చాలా పెద్ద కథే ఉంది. దర్శకుడిగా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న పూరి.. దూరదర్శన్ లో ఓ సీరియల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులలో షూటింగ్ కొరకు హైదరాబాద్ లోని రామంతపూర్ వెళ్లారట. అక్కడ లావణ్యను చూసి మొదటి చూపులోనే ప్రేమించేశాడట. తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలో తెలియని పూరి అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిసి, ‘ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఇది నా విజిటింగ్ కార్డు ఇందులో ఫోన్ నంబర్ కూడా ఉంది..నచ్చితే కాల్ చేయమని చెప్పు..’ అని కార్డు ఆ అమ్మాయికి ఇచ్చి వెళ్ళిపోయాడట.

చూసిన వెంటనే ప్రేమంటే ఎవరు నమ్ముతారూ.. లావణ్య కూడా అదే చేసిందట. మొత్తానికి పూరి పట్టువదలకుందా తన ప్రేమలో సక్సెస్ అయ్యాడు. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దానితో వీరిద్దరూ పెద్దలకు తెలియకుండా స్నేహితుల సమక్షంలో 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆకాష్, పవిత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో పూరి సినిమాలు చూస్తే అతని ప్రేమ నుంచే పుట్టాయనిపిస్తుంది.

Also Read

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీస్

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -