Sunday, May 12, 2024
- Advertisement -

రిలయన్స్ మరో సూపర్ ఆఫర్.. 148 కి 70 జీబీ

- Advertisement -
reliance bumper offer for telugu people

రిలయన్స్ జియో ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజుకో ఆఫర్ ఇస్తూ టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు అన్న బాటలో తమ్ముడు కూడా నడవాలని అనుకుంటున్నాడు. అందుకు గాను ఇక వృహాత్మక నిర్ణయం తీసుకున్నాడు.

తాను కాదు జియో కి తక్కువేం కాదు అని నిరూపించదలచుకున్నాడు. అందుకే ఈ సారి సరికొత్త ఆఫర్ తో రాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు తన ఆధ్వర్యంలోని ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) నుంచి అనిల్ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రిలయన్స్ నుంచి సరికొత్తగా రూ.148తో సరికొత్త ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ‘సూపర్ వాల్యూ’ టారిఫ్ ప్లాన్‌లో భాగంగా కేవలం రూ.148తో 70 రోజులపాటు 70 జీబీల 4జీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లకు మాత్రమే పరిమితమని ఆర్‌కామ్ పేర్కొంది. ఈ ప్యాక్‌తో రూ.50 టాక్‌టైమ్‌ను కూడా ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ప్యాక్‌లో భాగంగా వినియోగదారులు నిమిషానికి 25పైసలకే ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు.

{youtube}ZPRoX9euwBM{/youtube}

Related

  1. జియో మరో సూపర్ ఆఫర్.. ఇంకో సంవత్సరం పాటు పండగ
  2. జియో సూపర్ ఆఫర్ : 810 జీబీ డేటా ఇస్తుంది
  3. జియోకు తేరుకోలేని షాక్.. కేవలం రూ.103 కే అన్ని ఆఫర్లు..
  4. ”ధ‌న్ ధ‌నా ధ‌న్” ఆఫర్ ఇచ్చిన జియో.. తెలుసుకుంటే వావ్ అంటారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -