రిలయన్స్ జియో.. ఇండియన్ టెలికం రంగంలో సంచనాలకు కేంద్ర బిందుకువుగా మారిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జియో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇప్పటికే 4జీ టెక్నాలజీతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో.. ఇప్పుడు అతి తక్కువ ధరకే.. 4జీ ఫోన్ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతుంది.
{loadmodule mod_custom,GA1}
ఈ ఫోన్ కి సంబంధించి ఫీచర్లు ఇప్పుడు లీక్ అవ్వడంతో.. ఈ న్యూస్ మరోసారి సంచలనంగా మారింది. గ్రామీణ భారతావనిలోని అపారమైన మార్కెట్పై కన్నేసిన ముఖేష్ అంబానీ ఈ తక్కువ ధర ఫోన్లకు రూపకల్పన చేశారు. అన్ని జియో యాప్స్, 4జీ సిమ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే.. అతి తక్కువ ధరకు కాల్స్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ లో 2.4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం, 2 ఎంపీ రేర్ కెమెరా, ముందువైపు వీజీఏ కెమెరా ఉంటాయి.
{loadmodule mod_custom,GA2}
వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ తదితరాలకు డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి. రెండు మోడల్స్ లో ఇవి దొరకనున్నాయి. వీటి ధరలు రూ.1700 వరకూ ఉండగా.. తొలి దశలో సబ్సిడీపై రూ.999 నుంచి రూ.1,500 మధ్య విక్రయించాలని రిలయన్స్ జియో అధినేత భావిస్తున్నారు.
{youtube}Q0Vhgj8oClQ{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related