Friday, May 17, 2024
- Advertisement -

సత్తి, సావిత్రిల గురించి మీకు తెలియని విషయాలు..

- Advertisement -

ఓ ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో.. ఇద్దరు వ్యక్తులు బాగా ఫాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వీరి గురించి తెలియని వారు లేరు. వారే.. బిత్తిరి సత్తి..సావిత్రి. వీరికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అయితే సత్తి ఇప్పుడు టీవీ చానెల్ లో మాత్రమే కాకుండా సినిమాలో అవకాశాలు కొట్టేస్తున్నాడు.

2012లో “కామెడీ క్లబ్” అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు సత్తి. అనంతరం జర్నలిజం మీద ఉన్న ఆసక్తితో జర్నలిజం కోచింగ్ లో చేరాడు. కోర్స్ అయిపోయిన తర్వాత వ్యాఖ్యాతగా వివిధ ఛానల్స్ లో పని చేశాడు. 2015లో తీన్మార్ అనే కార్యక్రమంతో సత్తికి మంచి క్రేజ్ లభించింది. సత్తి రావడంతో ఆ షోకి మంచి సక్సెస్ అయ్యింది. ఇక సావిత్రి.. వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది.

అక్కడ తన భాషని, గొంతును, తెలంగాణ యాసను మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అన్నారు. అలా చాలా ఇబ్బందిపడిన తరువాత తెలంగాణ యాసలో తీన్మార్ లో వార్తలు చదవడంకోసం వెళ్లింది. చేరిన తొలిరోజుల్లో సినిమా వార్తలు చదివింది. ఆతర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్, వాయిస్ ఓవర్లు చదివింది. ఆమె గొంతు డిఫరెంట్ గా ఉండటంతో.. జనాలు ఆదరించారు. ఏది ఏమైన ఇప్పుడు వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -