Sunday, May 19, 2024
- Advertisement -

Video: లైవ్లో కొట్టుకు చచ్చారు..వీళ్లా మనకు నీతులు చెప్పేది..?

- Advertisement -

అంతా టీవీలకు అతుక్కుని ఆసక్తిగా…జాతీయ ఛానల్ ఐబిఎన్ 7 లైవ్ ను చూస్తున్నారు.అది కూడా వివాదస్పద సన్యాసిని రాధేయా గురించి.

అందుల్లో ఓం జీ అనే సాధువు,దీపా శర్మ అనే జ్యోతిష్యురాలు పార్టిసిపేట్ చేశారు.ఎవరికి వచ్చిన పాండిత్యాన్ని వారు చూపించుకునే ప్రయత్నాన్ని మెల్లమెల్లగా పరిచయం చేస్తున్నారు.

ఇంతలో అదే చర్చలోకి మరో జ్యోతిష్యురాలు రాఖీ భాయ్ వచ్చి ఒక్కసారిగా సన్యాసిని రాధేమాను విమర్శించింది.ఇది ఓం జీ సాధువు గారికి ఆగ్రహాన్ని తెప్పించింది.వెంటనే మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అంటూ ఓం జీ …..రాఖీభాయ్ ను ఉద్దేశించి మాటలు అన్నాడు. రాఖీ భాయ్ లైవ్ లో నిలదీయగా ఇది మిమ్మల్ని ఉద్దేశించి చేసిన మాటలు కాదు…దీపా శర్మ ను అన్న మాటలని మాట మార్చే ప్రయత్నం చేసాడు.

దీంతో రాఖీ భాయ్ విషయంలో ఆయన సేవ్ అయిపోయినా… దీపా శర్మ విషయంలో మాత్రం షేవ్ అయిపోయాడు.ఒళ్లు దగ్గర పెట్టుకోండని దీపా శర్మ చెప్పినా… వినకపోవడంతో అందరూ చూస్తుండగానే దీపా శర్మ లేచి ఆయనగారి చెంప చెల్లు మనిపించింది. వెంటనే ఓం జీ కూడా స్పందించి ఆమె చెంప పై కూడా చెల్లు మనిపించినప్పటికీ… అప్పటికీ జరగాల్సిన ముచ్చట జరిగిపోయింది. ఇక చేసేదేం లేక వారిని వారించి లైవ్ షో  ను ఐబిఎన్ ౭ వారు అర్ధంతరంగా ఆపేశారు.

Watch Video: 

 https://www.youtube.com/watch?v=jbFD4ZhwKhI

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -