బంతి గాల్లో లేస్తే సిక్సరే అన్నట్లు సాగింది వెస్టిండిస్ భయంకర బ్యాట్స్మెన్ రసెల్ ఇన్నింగ్స్. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను గెలిపించి తాను మ్యాచ్ విన్నర్నని మరోసారి నిరుపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కోహ్లి ( 84), డివిలియర్స్ ( 63) పరుగులు చేశారు. కోహ్లి,డివిలియర్స్ ఈ టోర్నిలో మొదటిసారి రాణించారు. 206 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన కోల్కతా నైట్రైడర్స్ ధాటిగానే ఇన్నింగ్స్ను ఆరంభించింది.
లిన్ ( 43) కోల్కతా ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. చివర్లో రసెల్ సిక్సర్ల మోత మోగించాడు. రసెల్ చేలరేగి 13 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫోర్తో పాటు ఏకంగా , 7 సిక్సర్లు ఉండటం విశేషం. రసెల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ ఓటమితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆశలు మరింత సన్నగిల్లాయి. తాజా సీజన్లో కోహ్లీ సేన ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది బెంగళూరు జట్టు.
- Advertisement -
రసెల్ సిక్సర్ల మోత..కోహ్లీ సేనకు ఐదో ఓటమి
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -