కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు.ఇటీవలే తన కెరీర్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి ఇప్పుడు మరోక సెంచరీతో మెరిశాడు.శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్ట్ భారత తొలి ఇన్నింగ్స్ మూడు రోజు ఆటలో 130 బంతుల్లో 10 ఫోర్లతో టెస్ట్ కెరీర్లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
ఓవర్నైట్ స్కోరు 312/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన పుజారా, కోహ్లిలు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ.. మూడో వికెట్కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక రెండో రోజు రెండు సెంచరీలు( మురళి విజయ్, పుజారా) నమోదుకాగా మూడో రోజు మూడో సెంచరీ నమోదు కావడం విశేషం.
దీంతో భారత్కు 168 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భారత్ స్కోరు 372/2. క్రీజులో పుజారా136 (350 బంతులు, 14 ఫోర్లు), కోహ్లి 100(130 బంతులు, 10 ఫోర్లు) లు బ్యాటింగ్ చేస్తున్నారు. లంక బౌలర్లు వికెట్లు తీయడానికి శ్రమించాల్సి వస్తుంది.