- Advertisement -
ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆసక్తికర పోరు ఆరంభమైంది. ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి కెప్టెన్ ఫిల్డింగ్ను ఎంచుకున్నారు.శార్దుల్ ఠాకూర్ స్థానంలో హర్భజన్ సింగ్ను తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్లాడిన చెన్నై జట్టు ఏడు మ్యాచ్ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్కి రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమవగా.. అతని స్థానంలో భువనేశ్వర్ టీమ్ని నడిపిస్తున్నాడు.విలియమ్సన్, షాబాజ్ నదీం స్థానంలో మనీశ్ పాండే, షకీబ్ అల్ హసన్ జట్టులోకి వచ్చినట్లు తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ వివరించాడు. తన నానమ్మ చనిపోవడంతో స్వదేశానికి వెళ్లడంతో ఈ మ్యాచ్కు కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు.