స్వదేశంలో ఆసిస్తో జరిగిన టీ20 రెండో మ్యాచ్లో భారత్ ఓడి సిరీస్ను కోల్పోయింది. మ్యాక్స్ వెల్ మెరుపు శతకంతో ఆసిస్కు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో ఆసిస్ 2-0తో సిరీస్ను గెలుచుకుంది. భారత గడ్డపై ఆసీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం విశేషం . నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీ20 సిరీస్ ఓటమికి మూటగట్టుకుంది 191 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ షార్ట్ (40), మ్యాక్స్వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్) ఆ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 73 పరుగులు జోడించారు. షార్ట్ అవుట్ అయినా కూడా మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన మ్యాక్సీ.. 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, కెెఎల్ రాహుల్ కలిసి శుభారంభాన్ని అందించారు. లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 47) దూకుడుగా ఆడగా.. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 72 నాటౌట్), ధోనీ (23 బంతుల్లో 40) సిక్స్ల మోత మోగించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.