భారత్,శ్రీలంక మధ్య రసవత్తర పోరు జరగనుంది. మూడో వన్డేకు ఇరు జట్ల ఆటగాల్లు విశాఖకు చేరుకున్నారు విశాఖపట్నం చేరుకున్న వారికి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. వచ్చే ఆదివారం విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక వన్డే జరగనుంది.
మూడు వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించగా, రెండో వన్డేలో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి వన్డేలో విఫలమయిన ఓపెనర్లు రెండో వన్డేలో ఫామ్లోకి వచ్చారు. దీంతో చివరి వన్డేపై ఆసక్తి నెలకొంది.
చివరి వన్డేలో శ్రీలంకపై భారత్ గెలిస్తే వన్డే ర్యాకింగ్స్ను మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో సౌతాఫ్రికా 120 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకతో మొదటి వన్డేలోనూ భారత్ గెలిస్తే ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచి ఉండేది. ఇక మూడూ వన్డేలో ఎవరు విజేతలవుతారో చూడాలి.