మౌంట్ మాంగనుయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో టీమిండియా న్యూజిలాండ్ను 243 పరుగులకే కట్టడి చేసింది. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. ఆ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత పాండ్య తిరిగి మూడో వన్డేలో ఆడుతున్నాడు. ఆటలో పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు.
మైమరిపించే ఫీల్డింగ్తో మైదానంలోని ఆటగాళ్లను.. అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. చహల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ముందుకొచ్చి షాట్ ఆడగా.. ఫార్వార్డ్ ఫీల్డింగ్ ఉన్న పాండ్యా సూపర్ డైవ్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. రెప్పపాటులో క్యాచ్ పట్టడంతో విలియమ్సన్ ఆశ్చర్యానికి గురయ్యాడు.ఇప్పుడు పాండ్యా పట్టిన క్యాచ్ వైరల్ అయ్యింది.
నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్స్ పెడుతూ.. పాండ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది కచ్చితంగా ఫీల్డర్ వికెట్, పాండ్య అద్భుత క్యాచ్ పట్టాడు’ అని భారత మాజీ క్రికెటర్ కైఫ్ ట్వీటాడు.