ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో కోహ్లీ సేనకు వైట్ వాష్ తప్పదని, తిరిగి టెస్టుల్లో నంబర్వన్ ర్యాంకును కైవసం చేసుకుంటామని అంటున్నాడు సఫారీ ఆటగాడు ఫిలాండర్. మూడు టెస్టు మ్యాచుల సిరీస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం చివరి టెస్టు జొహనెస్బర్గ్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే రెండు టెస్ట్లలో ఓడిన భారత్ సిరీస్ను కోల్పోయింది. కనీసం మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా.
బుధవారం నుంచి చివరి టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో మీడియాతో ఫిలాండర్ మాట్లాడాడు. తొలి రెండు టెస్టుల్లోనూ భారత బౌలర్లు మెరిసినా.. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో కనీసం మూడో టెస్టులోనైనా సత్తాచాటి పరువు నిలుపుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
చివరి టెస్టు గురించి దక్షిణాఫ్రికా ఏమీ అతిగా ఆలోచించడం లేదన్నారు. ఇప్పటికే సిరీస్ చేజిక్కినా.. ఉదాసీనతకి తావివ్వకుండా మూడో టెస్టులోనూ గెలిచి సిరీస్లో భారత్ని వైట్వాష్ చేస్తాం. టెస్టు ర్యాంకింగ్స్లో జట్టు మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోవాలంటే.. ఇకపై ఆడే అన్ని టెస్టుల్లోనూ గెలవాలని నిర్ణయించుకున్నాం’ అని ఫిలాండర్ ధీమా వ్యక్తం చేశాడు. సఫారీ క్లీన్ స్వీప్ చేస్తుందో లేక గెలిచి భారత్ పరువును దక్కించుకుంటుందో చూడాలి.