Sunday, May 19, 2024
- Advertisement -

న్యూ ఇయర్’ విషెస్ చెప్పిన విరుష్క జంట‌…

- Advertisement -

దక్షిణాఫ్రికా వీధుల్లో భారత క్రికెటర్లు స్టెప్పులతో అదరగొట్టారు. ఆదివారం ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో కలిసి కాసేపు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఓ బ్యాండ్‌కు సంబంధించిన వారు పాటలతో హోరెత్తించగా అక్కడే ఉన్న కోహ్లీ-ధావన్‌ ఆ పాటలకు అనుగుణంగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.

గత ఏడాది డిసెంబరు 11న ఇటలీలోని ఖరీదైన విల్లాలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేప్‌టౌన్ వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు ఆరంభంకానుండగా.. ఒకవైపు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూనే.. మరోవైపు అనుష్క శర్మతో కలిసి కోహ్లి సరదాగా తిరుగుతున్నాడు. ఈ జంట షికార్లకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా అభిమానులకి విరుష్క జోడి నూతన సంవత్సర శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ప్రారంభంకాగానే.. అనుష్క శర్మ భారత్‌కి తిరిగిరానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కఠినమైన ఈ సిరీస్‌లో కోహ్లి ఒకవేళ విఫలమైతే.. అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తాయనే కారణంతోనే అనుష్క అక్కడ నుంచి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారత్ జట్టు సఫారీ గడ్డపై మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. మొద‌టి టెస్ట్ జ‌న‌వ‌రి 5న ప్రారంభం కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -