ఐపీఎల్లో రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చైన్నై సూపర్ కింగ్స్ జట్టు దిగ్గజ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను అట్టిపెట్టుకొని అభిమానులకు తియ్యటి వార్త అందించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా చైన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది.
అయితే ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే చెన్నై ఫ్యాన్స్కు మజాను తెచ్చేసింది. రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో తిరిగి అడుగు పెడుతుడటంతోపాటు.. ఆ జట్టుకు మళ్లీ ధోనీనే నాయకత్వం వహించనుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వణక్కమ్ చెన్నై అంటూ రైనా, విజిల్ పొడు అని జడేజా అభిమానులకు తమ సందేశాన్నిచ్చారు. ఇక ధోని ఒప్పంద పత్రాలపై సంతక చేస్తున్న సమయంలో అతని కూతురు జీవా పక్కనే ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి
ఈ ముగ్గురు ఆటగాళ్లు కాంట్రాక్ట్ పేపర్ల మీద సంతకాలు చేస్తున్న వీడియోను చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పంచుకుంది. ధోనీని తమతో ఉంచుకోవడం పక్కా అని తెలిసినా.. రైనా, జడేజా విషయంలో తొలుత అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ వీటిని కొట్టిపారేసింది. ముగ్గురు స్టార్ ఆటగాళ్లను తమతోపాటే ఉంచుకుంది.
.