- Advertisement -
ఐపీఎల్ 12 వ సీజన్ జోరుగా సాగుతుంది. వీకెండ్ కావడంతో ఈ రోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. జైపుర్ వేదికగా రాజస్థాన్ జట్టు ముంబైతో తలపడనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట ఫీల్డింగ్ను ఎంచుకుంది. వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న ముంబై ఇండియన్స్ను రాజస్థాన్ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఇక రాజస్థాన్ జట్టు ఒక విజయం రెండు పరాజయాలుగా సాగుతోంది.
ప్లే ఆఫ్ రేసులో ముందుక వెళ్లాలి అంటే రాజస్దాన్ జట్టు గెలివాల్సిన పరిస్థితి. ఆటగాడిగా, కెప్టెన్గా రెండు విభాగాల్లో ఫెయిల్ అవుతున్న టీం ఇండియా ప్లేయర్ రహనేని కెప్టెన్గా స్థానం నుంచి తొలగించారు. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహారించనున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోస్ట్రాంగ్గా ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ ఎలా రాణిస్తుందో చూడాలి.