మౌంట్ మాంగనుయ్ లో జరగుతున్న రెండో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, చాహల్, భువి చెరో రెండు వికెట్లు, షమీ, జాదవ్ చెరో వికెట్ తీయడంతో కివీస్ 234 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ వన్డేలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్టన్నింగ్ స్టంపౌట్ వైరల్గా మారింది.
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్లో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాస్టేలర్ బంతిని డిఫెన్స్ చేస్తూ కొద్దిగా ముందుకు కాలు కదిపాడు. కానీ.. బ్యాట్కి అందని బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లిపోగా.. స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన రాస్టేలర్ వేగంగా క్రీజులో పాదం ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది. బంతిని అందుకున్న ధోనీ.. క్షణాల వ్యవధిలోనే వికెట్లను గీరాటేశాడు.
అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. టైలర్ కాలు కొద్దిసేపు గాల్లో ఉంది. అతని బ్యాక్ ఫూట్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే గాల్లో ఉండగా ధోనీ మెరుపు వేగంతో స్పందించి కివీస్ బ్యాట్స్మన్ను స్టంపింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. జాదవ్ బౌలింగ్లో కళ్లు మూసి తెరిచేలోపు అతడు చేసిన స్టంపింగ్ చివరికి బౌలర్నూ షాక్కు గురి చేసింది.