Thursday, May 2, 2024
- Advertisement -

ఆసిస్‌తో స్వ‌దేశంలో జ‌రిగే సిరీస్‌కు రోహిత్‌,ధావ‌న్‌లు దూరం…?

- Advertisement -

స్వ‌దేశంలో ఆసిస్‌తో జిరిగే వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు భార‌త్ ఓపెన‌ర్లు ధావ‌ణ్‌, రోహిత్ దూరంకానున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.అంత‌ర్జాతీయంగా ఫార్మాట్ ఏదైనా టీమిండియా విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఆసిస్ టూర్‌లో వ‌న్డే, టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా…న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో కూడా వ‌న్డే సిరీస్ గెలిచి మంచి ఊపుమీదుంది.

త్వ‌ర‌లో స్వదేశంలో జ‌రిగే ఆసిస్‌తో పోరాటానికి సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అటు టెస్ట్‌ల్లోనూ, ఇటు వ‌న్డేల్లోనూ కూడా జట్టు స‌మ‌తూకంతో ఉంది. మ‌రో వైపు రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌తో కూడా జ‌ట్టు బ‌లంగానే ఉంది. ప్ర‌పంచ క‌ప్‌ను దృష్టిలో ఉంచుకొని జ‌ట్టులోని కీల‌క ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి క‌ల్పిస్తూ రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు అందిస్తూ ప్ర‌యోగాలు చేస్తోంది.

ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌లో జ‌రుగుతున్న టీ-20 సిరీస్ త‌ర్వాత భార‌త్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగ‌నున్న వ‌న్డే సిరీస్‌కు మ‌రిన్ని మార్పులు జ‌రగొచ్చ‌ని టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి తెలిపాడు.వ రుస‌గా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడుతున్న ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. షమీకి విశ్రాంతి కావాలి. అలాగే ధ‌వ‌న్‌, రోహిత్ కూడా సుదీర్ఘంగా బ్రేక్ లేకుండా ఆడుతున్నారు. స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌రిగే వ‌న్డే సిరీస్ నుంచి వారికి విశ్రాంతి ల‌భిస్తే మంచిది` అని రవిశాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -