Thursday, May 2, 2024
- Advertisement -

గేల్ జిగేల్‌… కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ విజ‌యం

- Advertisement -

విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ మరో ఐపీఎల్‌ సీజన్‌ను ఘ‌నంగా ప్రారంభించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో క్రిస్‌ గేల్ మెరిశాడు. తాను ఎదుర్కొన్న తొలి 27 బంతుల్లో 29 పరుగులు చేసిన గేల్‌,తర్వాతి 20 బంతుల్లో 50 పరుగులు చేయడం విశేషం. క్రిస్‌ గేల్‌ ( 79) అర్ధ సెంచరీ సాధించాడు. గేల్ అవుట్ అయిన త‌రువాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్లు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

185 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. జోస్‌ బట్లర్‌ (69) దూకుడుగా ఆడగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ అంద‌రు ఫెయిల్ అయ్యారు. ఐపీఎల్‌లో పునరాగమనం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ (20) ప‌రుగులు మాత్ర‌మే చేసి అవుట్ అయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రిస్ గేల్‌కు ద‌క్కింది. గేల్ అండ‌తో ఐపీఎల్ 12వ సీజ‌న్‌లో శుభారంభం చేసింది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జ‌ట్టు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -