భాజాపా సీనియర్ నేత,కేంద్రమాజీ మంత్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఎయిమ్స్లో మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ , క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు.
అరుణ్ జైట్లీ గారు పోయారన్న వార్త తెలియగానే ఎంతో విచారం కలిగిందని కోహ్లీ ట్వీట్ చేశాడు. 2006లో తన తండ్రి చనిపోయినప్పుడు జైట్లీ తన ఇంటికి వచ్చి పరామర్శించారని, ఆ సమయంలో ఎంతో బిజీగా ఉన్నా, అన్ని పనులు వాయిదా వేసుకుని తమ నివాసానికి వచ్చి సంతాపం తెలియజేశారని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
ఎంతో విలువైన సమయాన్ని తమకోసం కేటాయించాడని వివరించాడు. ఆయనది ఎంతో మంచి స్వభావం అని, ఇతరులకు సాయపడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారని కొనియాడాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు కోహ్లీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.