- Advertisement -
విశాఖపట్నంలో జరిగిన తొలి టి-20మ్యాచ్లో అతిథ్య ఆసీస్ జట్టు చేతిలో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో విజయం ఆసీస్ జట్టునే వరించింది. చివరి బంతికి రెండు పరుగులు సాధించి ఆసీస్ విజయం సాధించింది. టాస్ గెలిచి ఆసీస్ జట్టు తొలుత భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం 126 పరుగులు చేసింది.కెఎల్ రాహుల్ (50) అర్థ సెంచరీతో రాణించాగా,ధోనీ (29), కోహ్లీ (24), పరుగులు చేశారు. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మాక్స్వెల్ (56 ) అర్థసెంచరీ సాధించి ఆ జట్టు విజయానికి బాటలు వేశాడు.