టీమిండియా పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ విలక్షణమైన శైలితో ఉంటుంది. ఈ ప్రపంచకప్లో రాణిస్తున్నారు. బుమ్రా శైలిని ఇప్పటి వరకు చాలా మంది అనుకరించారు. మనదేశమే కాదు.. ఇతర దేశాల అభిమానులు, పిల్లలు బుమ్రా బౌలింగ్శైలికి ముగ్ధులై ఇమిటేట్ చేశారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బుమ్రా బౌలింగ్ను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించాడు.
గ్రౌండ్లో కాస్త టెన్షన్గా కనిపించే కెప్టెన్ విరాట్ కోహ్లీ… బయట మాత్రం ఇతర ఆటగాళ్లతో ఎంతో సరదాగా గడుపుతుంటాడు. వారిని ఆటపట్టించడంలోనూ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. ఇలాంటి సంఘటన ఒకటి ఇండియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్కు ముందు చోటు చేసుకుంది. మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ను రిజర్వ్డేకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రాస్ టేలర్ (85 బంతుల్లో 67 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఐదుగురు భారత బౌలర్లు తలా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టేలర్తో పాటు లాథమ్ (3 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు.