Friday, March 29, 2024
- Advertisement -

భారత్, న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి వరుణుడు ఆటంకం

- Advertisement -

గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి వల్ల క్రికెట్ మ్యాచ్ కి ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, న్యూజిలాండ్ ల ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. జరక్క జరక్క ఒక్క మ్యాచ్.. అది కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్స్ వరుణుడు అడ్డు రావడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

వర్షాకాలంలో మ్యాచ్ షెడ్యూల్ ఫిక్స్ చేసినందుకు క్రికెట్ అభిమానులు ఐసీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే సౌతాంప్టన్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ చారిత్రక టెస్టు మ్యాచ్ కు సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.

ప్రస్తుతం ఈ మైదానం చిత్తడిగా మారిన తీరు చూస్తే, లంచ్ లోపల మ్యాచ్ ఆరంభమ్యే అవకాశం కనిపించడంలేదు. దీంతో సోషల్ మీడియాలో స్పోర్ట్స్ లవర్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. వర్షం పడుతుందని తెలిసీ .. ఈ స్టేడియం ఎలా సెలెక్ట్ చేశారని మండిపడుతున్నారు.

సిధ్ధిపేటలో విషాదం.. తన చితి తానే పేర్చుకొని వృద్దుడి మృతి!

ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ టీజర్

శ్రీవారి దర్శన టికెట్ల కోటా పెంపుపై టీటీడీ కీలక నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -