Wednesday, May 1, 2024
- Advertisement -

2019 ఎన్నాల్లో గెలిచి తాడిప‌త్రి గెలుపును విజ‌య‌మ్మ‌కు కానుగా ఇస్తాం….

- Advertisement -
Pedda Reddy says tadipatri constituency will win and Gift to YS Vijayamma on 2019 elections

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ప్లీన‌రీ స‌మావేశాలు ఏర్పాటు చేసింది.అన్ని నియేజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులు స్వ‌యంగా పాల్గొని నాయ‌కులు,శ్రేణుల‌ల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నిపంపుతున్నారు. అనంపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ప్లీనరీ పెద్దెత్తున నిర్వహించారు.

తాడిపత్రి వైసీపీ ఇన్‌చార్జ్ పెద్దారెడ్డి ఆధ్వర్యంలోజరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.పెద్దారెడ్డి జేసీ కుటుంబ‌పై నిపులు చెరిగారు.

{loadmodule mod_custom,GA1}

జేసీ సోదరుల దౌర్జన్యాలు, నిధుల దోపిడీ, దురుసుతనం, హత్యా రాజకీయాలతో నియోజకవర్గ ప్రజలు విసుగు చెందారు. వారి పాలనకు చరమగీతం పాడేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్నారు. జేసీ కుటుంబం ప్రతి దోపిడికి కొందరు బ్రోకర్లను పెట్టుకుందని విమర్శించారు. జేజేసీ పాలనకు చరమగీతం పాడి ఆయ‌న కంచుకోట‌ను 2019 ఎన్నిక‌ల్లో బ‌ద్ద‌లు కొడ‌తామ‌ని హెచ్చ‌రించారు.
2019 ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ జెండా ఎగరేసి చూపిస్తామన్నారు. తాడిపత్రి గెలుపును నియోజకవర్గ ఆడపడుచు అయిన విజయమ్మకు కానుకగా ఇస్తామని పెద్దారెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో చురుగ్గా ఉన్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా జేసీ సోదరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మాట వినకపోతే హత్య చేసేందుకు కూడా వెనుకాడరన్నారు.

{loadmodule mod_custom,GA2}

నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఏ అన్యాయం జరిగినా సహించేదిలేదన్నారు. వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.జేసీ కుటుంబం అరాచకాల వల్ల నష్టపోయిన వారిలో తానూ ఉన్నానని, వారికి అడ్డుకట్ట వేయాలంటే నియోజకర్గంలోని నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అయితే 2019 ఎన్నిక‌ల్లో జేసీ కంచుకోట బ‌ద్ద‌ల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -