టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నటి శ్రీరెడ్డి. తన ఫీలింగ్స్ చెప్పుకుంటే కొందరు పిచ్చిపిచ్చిగా కామెంట్లు చేస్తున్నారని …అలాంటి వారి తాట తీస్తానని శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన సోషల్ మీడియా పేజ్ లో తాను ఏదైనా రాసుకుంటానని… ‘నీ పేరు మెన్షన్ చేశానా లేక నీ సినిమా పేరు మెన్షన్ చేశానా… జైల్లో పెట్టిస్తానంటున్నావు శేఖర్ కమ్ములా ఈ రోజు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్ట ప్రకారం వెళ్తావా? వెళ్లు, నాకేమైనా భయమా? నీవు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి, నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి?’ అంటూ ప్రశ్నించింది. సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలకు ఒకటే చెబుతున్నానని… తాను ఒంటరిని అయినప్పటికీ, తనకు కావాల్సినంత ధైర్యం ఉందని చెప్పింది. పోరాటానికి డబ్బులు అవసరం లేదని, గుండెలో ధైర్యం ఉంటే చాలని తెలిపింది.
తప్పు చేయనప్పుడు సైలెంట్ గా ఉండకుండా ఎందుకు స్పందించారని ప్రశ్నించింది. తాను కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోబోతున్నానని… త్వరలోనే నోటీసులు అందుతాయని తెలిపింది. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడానికి ప్రయత్నించకండి అని చెప్పింది. ఈ తతంగం చూస్తుంటే శ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడే తెగేలాలేదు.