పుల్వామా ఉగ్రవాది దాడిని భారతీయులు జీర్ణించుకోలేకపొతున్నారు. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకోవడంతో ప్రజలందరూ ఉగ్రవాదం, పాక్ పై రగిలిపోతున్నారు.ముష్కరులను తరిమి కొట్టాలని, పాక్ కు అనుకూలంగా మాట్లాడే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా పేర్కొంటున్నారు. దేశంలోనే ఉన్న కొందరు పాక్కు అనుకూలంగా పోస్ట్లు పెడుతున్నారు. ఆ పోస్ట్లు పెట్టె వారిపై యాంకర్ రష్మి తన ఉగ్రరూపాన్ని చూపించింది.
పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ చేసిన కామెంట్ పై స్పందించిన రష్మి.. ‘దేశ విభజన సమయంలోనే పాక్ వైపు వెళ్లాల్సింది. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ట్విట్టర్ వేదికగా ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చింది రేష్మి.నువ్వు మావాడివి అయ్యావు కాబట్టి బతికి పోయావు – నీ పాకిస్తాన్ గొప్పదనం ఏంట్రా -దేశ విభజన సమయంలో నువ్వు అవతలి వైపు వెళ్లాల్సింది. మాతోనే మీకు అస్థిత్వం. మూసుకుని కూర్చో అంటూ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ జిందాబాద్ అన్న నువ్వు ఈ దేశానికి ఎలా మొహం చూపుతావు వెళ్లి పాకిస్తాన్ లో ఎలుక పొక్కలో మొహం పెట్టుకో అంది. పుల్వామ దాడికి తెగబడిన ప్రతి ఒక్కరిని కూడా నామ రూపాలు లేకుండా ఏరి వేయాలని తన ఆవేశాన్ని బయటపెట్టింది. ఇలాంటి నా కొడుకులను ఏం చేసినా పాపం లేదు అంటూ” ట్వీట్ చేసింది. రేష్మితో పాటు పలువురు సెలెబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. రేష్మి చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.