డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి అందరికి తెలిసిందే. వరుసగా ఐదు హిట్లు కొట్టిన దర్శకుడు ఇతను. పటాస్ సినిమా ద్వారా పరిచయం అయ్యి హిట్ కొట్టి.. మొన్న వచ్చిన సరిలేరు తో మొత్తం ఐదు హిట్లు తన ఖాతలో వేసుకున్నాడు.
అయితే పటాస్ సినిమా మినహా మిగిలిన నాలుగు సినిమాల్లోనూ సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించారు. అసలు తన సినిమాల్లో వరుసగా రాజేంద్ర ప్రసాద్ ను తీసుకోవడానికి గల కారణాల గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఇటివలే అలితో సరదాగా అనే కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. “ముందు నుంచి రాజేంద్రప్రసాద్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలను వదలకుండా చూసేవాడిని.
ఆయన ఎక్కడ కనిపించినా ఆయన పట్ల గల అభిమానాన్ని చాటుకోవాలని అనుకునేవాడిని. నేను దర్శకుడిని అయిన తర్వాత ఆయనతో కలిసి పనిచేసే ఛాన్స్.. అదృష్టం లభించింది. ఆయన నటన పట్ల నాకు గల ఇష్టమే .. ఆయన పట్ల గల అభిమానమే నా సినిమాల్లో ఆయనకి అవకాశం ఇవ్వడానికి ప్రధాన కారణమని” అనిల్ చెప్పుకొచ్చారు.