Saturday, April 27, 2024
- Advertisement -

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్..!

- Advertisement -

ప్రముఖ నటి, కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత అంబరీశ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలిపింది. తలనొప్పి, గొంతులో ఇబ్బందికరంగా ఉండటంతో పరీక్ష చేయించుకున్నానని.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో సుమలత పర్యటించారు.

దాంతో ఆమె కరోనా సోకింది. “శనివారం, జూలైన 4న నాలో తలనొప్పి, గొంతులో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయి. నా నియోజకవర్గంలో పర్యటన చేయడం వల్ల నాకు కరోనా సోకి ఉండవచ్చని భావించి పరీక్ష చేయించుకోవాలని అనుకున్నాను. పరీక్ష తర్వాత చాలా స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. ఇంట్లో ఉంటూ చికిత్స పొందాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం నేను స్వయం నిర్బంధంలో ఉన్నాను. డాక్టర్లు సూచించిన విధంగా స్వయంగా చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయవల్ల నాకు రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉంది. మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటాననే విశ్వాసం నాకు ఉంది.

ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వ్యక్తుల గురించి పూర్తి వివరాలను ప్రభుత్వ అధికారులకు అందజేశాను. అయినప్పటికీ, నన్ను ఈ మధ్య కలిసిన ఎవరికైనా ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్‌పై పోరాడి గెలుద్దాం’’ అని సుమలత తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా, తన భర్త ఎం.హెచ్.అంబరీశ్ మరణాంతరం మాండ్య ఎంపీ స్థానం నుంచి సుమలత స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కన్నడ రెబల్ స్టార్ అయిన అంబరీశ్.. రాజకీయనేతగా కూడా రాణించారు. మాండ్య నుంచి మూడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చాను : హైపర్ ఆది

ఇప్పుడు శ్రీహరి ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి..!

గంగోత్రి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

దొరబాబు సెక్స్ రాకెట్.. మళ్లీ బయటపెట్టిన హైపర్ ఆది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -