Friday, April 26, 2024
- Advertisement -

గుండు… అలా ఎందుకు చేసాడంటే…

- Advertisement -

ప్రముఖ కమెడియన్ గుండు హనుమంతరావు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ షో ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. ఈ షోలో రాగినితో గుండూ ఎంట్రీ ఇచ్చిన తన దయనీయ పరిస్థితిని వివరించాడు.దీంతో ఎంతగానో చలించిన ఆలి అతనికి సాయం చేస్తానని హామి ఇచ్చాడు. ఆ సాయం ఇపుడు జరిగిందో లేదో తెలియదుగాని చిరంజీవి భార్యకు ఈ విషయం తెలిసి చిరుతో సమస్యను చెప్పి సాయం చేయాలని అడిగింది. అంతే వెంటనే చిరు మా ప్రెసిడెంట్ శివాజిరాజాను పిలవడం అతను ఏడిద శ్రీరాంతో కలిసి వెళ్లడం…సురేష్ కొండేటి కూడా వీరితో ఉండడంతో మీడియాలో దీనికి మంచి పబ్లిసిటీ వచ్చింది. స్వయంగా 2లక్షల రూపాయలు చిరు శివాజి రాజాకు ఇచ్చి…గుండు హనుమంతరావుకు ఇమ్మనడంతో చిరు సత్కారానికి అందరూ జేజేలు కొట్టారు.

ఇక్కడి వరకు భాగానే ఉంది. మరి చిరు ఇచ్చిన మనీని గుండు ఏం చేశాడు. ఆ డబ్బును స్వీకరించాడా లేక మరేమైనా చేశాడా అనేదే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కట్ చేస్తే…తెలిసిన విషయం ఏమిటంటే…చిరు తనకు ఇచ్చి డబ్బును గుండు డైరెక్ట్ గా తీసుకోకుండా..తన సమస్య ఏవిధంగా అయితే ఆలీతో సరదాగా షోతో బయట ప్రపంచానికి తెలిసిందో…అదే షోకు మళ్లీ వెళ్లి తన కుమారుడిని వెంటపెట్టుకుని ఆ షో స్టేజ్ ఎక్కి…చిరు ఇచ్చిన చెక్ ను అందరికీ చూపించాడు.ఈవిధంగానైనా మిగతా హీరోలకు బుద్ది వస్తుందని ఈ షో చూసినవారంతా అన్నారు.తమ తోటి నటుడు ఇలా నీరు గారిపోతుంటే ఆమాత్రం పట్టించుకోకపోతే ఎలా అని మిగతా నటీనటులను సర్వత్రా విమర్శిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -