Saturday, April 27, 2024
- Advertisement -

మ‌హ‌న‌టి ఆడియో రిలీజ్‌కు యంగ్‌ టైగ‌ర్‌

- Advertisement -

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మహానటి’. చిత్రీకరణ పనులు ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన స్టిల్స్‌ టీజర్‌ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా చిత్రయూనిట్ ఆడియో రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది.

ఈ రోజు జరగనున్న ఆడియో వేడుకకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వైజయంతి మూవీస్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎన్టీఆర్‌ మహానటి ఆడియో రిలీజ్‌కు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో మే 9న విడుదలకానున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత వంటి స్టార్ నటీ నటుల నటించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -