పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయాలకి సంబందించిన పనుల తో బిజీ గా గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే పవన్ కళ్యాణ్ క్రమక్రమం గా సినిమాల వైపుకి ఆకర్షితుడు అయితున్నాడు అని ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యం గా పవన్ కళ్యాణ్, సై రా నరసింహ రెడ్డి సినిమా పైన పెంచుకున్న మక్కువ అంత ఇంతా కాదు. అందుకే అడిగిన వెంటనే వెళ్ళి ఈ సినిమా కి సంబంధించి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్.
అయితే ఈ సినిమా వాయిస్ ఓవర్ ఇవ్వడం వరకే పరిమితం కాకుండా ఇక ప్రమోషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్, చిరంజీవి మరియు రామ్ చరణ్ ల తో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ప్రశ్నలు వేస్తూ ఉంటె దానికి చిరంజీవి సమాధానం ఇస్తూ సై రా సినిమా గురించి మాట్లాడతారు అనే ప్రచారం సాగుతుంది.అయితే ఈ రూమర్ లో ఎంత వరకు సత్యం దాగి ఉంది అనే విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.