Friday, April 26, 2024
- Advertisement -

ఆసక్తికరమైన ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘రాజు గారి గది 3’

- Advertisement -

‘రాజు గారి గది’ సినిమా హిట్ అయింది కానీ, ‘రాజు గారి గది 2’ సినిమా మాత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఇప్పుడు దర్శకుడు ఓంకార్ ‘రాజు గారి గది’ సిరీస్లోని మూడవ పార్ట్ ‘రాజు గారి గది 3’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం ముందుగా తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఓంకార్ సంప్రదించారు కానీ ‘ఉయ్యాల జంపాల’ అవికా గోర్ ని ఫైనలైజ్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను ఇవాళ దగ్గుబాటి వెంకటేష్ విడుదల చేశారు.

ఊర్వశి, అలీ, అజయ్ ఘోష్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్లో అవికా మరియు అశ్విని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ట్రైలర్ చూస్తే సినిమా కచ్చితంగా ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుందని మిగతా రెండు భాగాలతో పోలిస్తే ‘రాజుగారిగది 3’ సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కి షబ్బీర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘రాజు గారి గది 3’ సినిమా ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -