టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ ఇప్పుడు అవకాశాలు కోసం చేతులు చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది.స్పైడర్ సినిమా తరువాత రకుల్ తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించలేదు. ఇటీవల కాలంలో రకుల్ చేతి వరకు వచ్చిన ఆఫర్స్ కూడా చేయిదాటి పోతున్నాయి. వెంకీమామ సినిమాలో మొదటగా నాగచైతన్యకు హీరోయిన్గా రకల్ తీసుకున్నారు. వీరిద్దరు గతంలో రారండోయ్ వేడక చూద్దాం వంటి హిట్ సినిమాలో నటించారు. కాని ఈ మధ్య కాలంలో రకుల్కు సరైన హిట్ లేదు. దీంతో రకుల్ను తప్పించి ఆమె స్థానంలో రాశి ఖాన్నాను హీరోయిన్గా తీసుకున్నారు.
నాగచైతన్య హ్యాండ్ ఇచ్చినప్పటికి , ఆయన తండ్రి కింగ్ నాగర్జున మాత్రం రకుల్ను ఆదుకున్నాడు.నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ‘మన్మధుడు 2’ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ్కు భార్యగా కనిపించనుంది రకుల్. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ అనుకున్నారు. తరువాత ఏం జరిగిందో తెలియదు కాని,సీన్లోకి రకుల్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.సినిమా ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లోనే జరపనున్నారని తెలుస్తోంది.
- Advertisement -
అప్పుడు కొడుకుతో, ఇప్పుడు తండ్రితో …!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -