Friday, April 26, 2024
- Advertisement -

శృతి హాసన్ డిమాండ్ మామూలు గా లేదు

- Advertisement -

శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసి లండన్ నుంచి ఇండియా తిరిగి వచ్చి ఇప్పుడు బుద్ధిగా సినిమాల పైన దృష్టి పెట్టింది అని అందరికీ తెలిసిన విషయమే. అటు తమిళం తో పాటు ఇటు తెలుగు లో కూడా హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఏ ఏ సినిమాలు చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నూ నెలకొంది. అయితే తాజా ఫిలింనగర్ సమాచారం మేరకు శృతి హాసన్ రవి తేజ నటించే తదుపరి చిత్రం లో నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. ఇంతకు ముందు వచ్చిన బలుపు అనే సినిమా లో వీరు ఇద్దరూ కలిసి నటించిన సంగతి మనకి తెలిసిందే.

అయితే ఇదేమి కొత్త విషయం కాదు కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ ని తీసుకోవాలా వద్ద అనే విషయం పై దర్శక నిర్మాతలు చర్చ మొదలు పెట్టారు. అది ఆసక్తికర విషయం. ఎందుకంటే శృతి హాసన్ ఈ సినిమా కోసం కోటిన్నర పారితోషికం అడిగిందట. అయితే కాటంరాయుడు తర్వాత తెలుగు లో సినిమాలు చేయని శృతి సడన్ గా వచ్చి కోటిన్నర అడిగితే ఎలా అని చిత్ర యూనిట్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -