సింగర్ బేబి ..ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈమె గురించి చర్చ నడుస్తుంది.ఓ మారు మూల గ్రామంలో పుట్టిన బేబి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సరదాగా పాడిన ఓ పాట ఇప్పుడు బేబిను ఓ సెలబ్రిటీని చేసింది.చిరంజీవి నుంచి అస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహామాన్ వరకు బేబి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆమెలో ఎంతటి టాలెంట్ దాగి ఉందో అర్ధం చేసుకోవాలి.బేబి ఇటీవలే సినిమాలలో తన తొలిసాంగ్ను పాడింది .ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే సంగీతంలో ఆమె ఓ పాటను పాడింది.ఆమె తాజాగా పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. .ఇక బేబి పాటలు పాడటం ద్వారా బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.
ఆమె తన తొలి పాటకే ఓ స్టార్ సింగర్ పాడితే ఎంత ఇస్తారో అంత ఇచ్చారని సమాచారం. బేబి తన తొలి పాటకుగాను 32 వేలు తీసుకుందని తెలుస్తుంది.సింగర్ గీతా మాధురి సైతం ప్రస్తుతం పాట పాడితే ఇంతటి పారితోషకం తీసుకోరని సమాచారం.బేబి హవా ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఆమెను పెద్ద సింగర్గా చేసే అవకాశం లేకపోలేదు.ఇప్పటికే ఆమెతో పాట పాడించాలని చాలమంది సంగీత దర్శకులు ప్లాన్ చేస్తున్నారు.ఈ లెక్కన ఆమె అతి త్వరలోనే కోటీశ్వరాలిగా మారడం ఖాయం అని చెప్పవచ్చు.