మారుతి సినిమాలలో ఏమున్నా లేకపోయినా కామెడీ మాత్రం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా హీరోలని విభిన్న పాత్రల్లో చూపించడం కేవలం మారుతి కి మాత్రమే చెల్లింది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా లో నాని కి మతిమరుపు పాత్ర, ‘మహానుభావుడు’ సినిమాలో శర్వానంద్ కి అతి శుభ్రత ఇలా హీరో క్యారెక్టర్లకు ఏదో ఒక జబ్బు పెట్టినా సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మారుతి తెరకెక్కించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక మారుతి తర్వాతి సినిమా ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం మారుతి ఈసారి హీరోయిన్ క్యారెక్టర్ని వెరైటీగా చూపించాలని ఫిక్సయ్యాడట. సాయిధరమ్ తేజ్ తో మారుతి ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ‘ప్రతి రోజూ పండగే’, ‘భోగి’ లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ నెలాఖరున చిత్ర షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకూ ప్రాధాన్యట ఉంటుందట. ఎమ్మెధ్య బాగా పాపులర్ అయిన టిక్ టాక్ ఏ సినిమాలో వాడనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ కి టిక్ టాక్ లు చేసే హాబీ ఉంటుందట. ఆ టిక్ టాక్ ల చుట్టూనే మారుతి వినోదం పండించబోతున్నాడని తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం నిధి అగర్వాల్, రుక్సార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.