న్యూయర్ వస్తుంది అంటే పండుగ వాతవరణం వచ్చినట్లే.చిన్ని పిల్లల నుంచి పెద్దలకు వరకు కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు.ఇక యువత గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలా?.ఆట,పాటలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.ఇక కొత్త సంవత్సరం అప్పుడు కొందమంది సెలబ్రిటీలకు మంచి డిమాండ్ ఉంటుంది.తమ సంస్థలలో వేడుకల నిమిత్తం పలువురు సెలబ్రిటీల చేత ప్రొగ్రామ్లు చేయిస్తారు.మళ్లీ కొత్త సంవత్సరం వేడుకలు దగ్గర పడటంతో సెలబ్రిటీలకు డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటికే పలువురు అందాల కథానాయికలు 31 రాత్రి ఈవెంట్ల కోసం లాక్ అయ్యారట. అలాగే భారీ గా స్టార్ హీరోయిన్లతో నిర్వహించనున్న ఓ ఈవెంట్లో తెలుగమ్మాయిలు యామిని భాస్కర్ నిత్యా శెట్టి అలేఖ్య వంటి వాళ్లు పార్టిసిపెంట్లుగా ఉంటారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే సదరు తెలుగమ్మాయిలతో బ్రోచర్ కార్యక్రమాలు జరగడం విశేషం. ఈసారి ఈవెంట్లకు కపుల్ టిక్కెట్లు రూ.3000 నుంచి రూ.10000 అంతకుమించి ఫిక్స్ చేస్తున్నారట. హైదరాబాద్ – రామోజీ పిలిం సిటీలోనూ భారీ ఈవెంట్లకు సన్నాహాలు చేస్తున్నారు.