Friday, April 26, 2024
- Advertisement -

స్నానం చేస్తుండగా వీడియో.. అత్యాచారం : సింగర్ చిన్మయి ఫైర్

- Advertisement -

నిన్న ఏడేళ్ల బాలిక జయప్రియ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇది మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమెపై నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. తాజాగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అందర్ని ఈ ఘటన షాక్ కు గురి చేసింది. ఈ విషయంపై చిన్మాయి శ్రీపాద ఫైర్ అయింది.

ఏడేళ్ల బాలికను ముగ్గురు కిరాతకులు అత్యాచారం చేసి చంపిన ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన తమిళ సమాజంతో పాటు సెలెబ్రిటీలు సైతం ఫైర్ అయ్యారు. చట్టాలు మార్చాలి, మహిళలకు రక్షణ కల్పించాలని అందరూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా విన్నవించుకుంది. తాజాగా చెయ్యూరు యూత్ లీడర్ దేవేంద్రన్ అతని సోదరుడు కలిసి ఓ మహిళపై గత నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. శశికళ (22) స్నానం చేస్తుండగా వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేయసాగారు.

ఈ మేరకు చిన్మయి స్పందిస్తూ.. JusticeForSasikala అంటే ఏంటో వివరించింది. ‘22 ఏళ్ల యువతి స్నానం చేస్తుండగా.. ఇద్దరు సోదరులు వీడియో తీశారు. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ గత నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. జూన్ 24న ఆమె ఉరి వేసుకుని చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నార’ని తెలిపింది. అంతేకాకుండా వారు ఓ పొలిటికల్ పార్టీకి చెందిన వారని తెలుస్తోంది అంటూ చిన్మాయి ఫైర్ అయింది.

బాలకృష్ణ పిలువు వేరే.. అలా అంటే కొట్టేస్తా : నగ్నం హీరోయిన్ కామెంట్స్

బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్..!

వర్మ ‘పవర్ స్టార్’ సినిమా హీరో దొరికేశాడు..!

టీవీ సీరియల్ నటి నవ్యకు కరోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -