Friday, April 26, 2024
- Advertisement -

గ్యాంగ్స్టర్ గా మెగా హీరో కి సాహసమే..

- Advertisement -

తమిళం లో సిద్ధర్థ్ ప్రధాన పాత్ర లో బాబీ సింహ విలన్ గా వచ్చిన చిత్రం జిగర్తాండ. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమా కి దర్శకుడు. ఈ సినిమా లో సిద్ధర్థ్ పాత్ర కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే బాబీ పాత్ర కి మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తెలుగు లో హరీష్ శంకర్ ఈ సినిమా ని వాల్మీకి పేరు తో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా లో చాలా మార్పులు చేసారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో సిద్దార్థ్ పాత్ర ని మార్చేసి దానిని ఒక చిన్న పాత్ర గా చేసి, ఆ పాత్ర కి అథర్వ మురళి అనే తమిళ నటుడిని ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు.

ఇక వరుణ్ తేజ్ పాత్ర ని ఇంకా బెటర్ చేశారట. ఒక పెద్ద గ్యాంగ్స్టర్ పాత్ర లో వరుణ్ తేజ్ మనకి ఈ సినిమా లో కనిపించనున్నారు అనే సంగతి తెలిసిందే.ఇటీవలే విడుదల అయినా ప్రీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ గ్యాంగ్స్టర్ గా వరుణ్ లుక్స్ కొంచెం తేడా కొట్టాయి. సోషల్ మీడియా లో అయితే హైప్ ఇస్తున్నారు కానీ మరి నిజానికి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -