Friday, April 26, 2024
- Advertisement -

మ‌రో సారి బుక్ అయిన లోకేష్‌….హోమంత్రి ఇచ్చిన కౌంట‌ర్‌కు షాక్‌

- Advertisement -

మాజీ సీఎం చంద్ర‌బాబు కొడుకు లోకేష్ ట్విట్ట‌ర్ పిట్ట అన్న సంగ‌తి తెలిసిందే. మిడి మిడి జ్ణానంతో విమ‌ర్శ‌లు చేయ‌డం అంద‌రిలో న‌వ్వులు పాలు కావ‌డం మామూలే. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గారి నుంచి వైసీపీ అభ్య‌ర్ధి ఆళ్ల‌పై ఓట‌మిపాల‌యిన లోకేష్ మ‌రో సారి అడ్డంగా బుక్ అయ్యారు.

పార్టీలో త‌న‌దైన చ‌ర్య‌లు, కామెంట్ల‌తో న‌వ్వుల‌పాలు అవ‌డంతో పాటుగా తెలుగుదేశం పార్టీని ఇర‌కాటంలో ప‌డేసే ఈ ప‌చ్చ‌పార్టీ యువ‌నేత‌…మ‌ళ్లీ అదే రీతిలో అధికార వైసీపీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ సారి హోమంత్రి మేక‌తోటి సుచ‌రిత ఇచ్చిన కౌంట‌ర్‌కి షాక్ తిన్నారు లోకేష్‌.

అస‌లు విష‌యానికి వ‌స్తే….ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు గ్రామాల్లో వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో టీడీపీ-వైసీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్వ‌లు, దాడులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై టీడీపీ కార్య‌క‌ర్త‌ల మీద వైసీపీ నేత‌లు దాడులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.సానుభూతిపరులపై వైకాపా రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నానంటూ ఘాటుగానె ట్విట్ట‌ర్‌లో వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఈ వ్యాఖ్య‌ల‌కు హోమంత్రి గుణాకాల‌తో స‌హా ఇచ్చిన కౌంట‌ర్‌కు లోకేష్ కంగుతిన్నారు. మహిళా అధికారిణిని చెంప మీద కొట్టినా పట్టించుకోని పరిస్థితి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. కాల్ మనీ వ్యవహారంలో అన్యాయాన్ని నిలదీసినందుకు తమ పార్టీ ఎమ్యెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్ పై దాడి జరిగితే.. దానిని కోడికత్తి దాడిగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. అలాంటి టీడీపీకి వైసీపీపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు.

అన్యాయాన్ని నిలదీసినందుకు మా ఎమ్యెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డ సుచరిత… మా గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో వైఎస్ జగన్‌పై దాడి జరిగినా కోడికత్తి అంటూ ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు బంగం వాటిల్లితే ఉపేక్షించ‌వ‌ద్ద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పార‌న్నారు. ఇటీవల గొడవల్లో టీడీపీ వాళ్లు 44 మంది గాయపడితే వైసీపీకి చెందిన వాళ్లు 57 మంది గాయపడ్డారని వివరణ ఇచ్చారు. దీంతో లోకేష్ మిడి మిడి జ్ణానంపై న‌వ్వుకుంటున్నారు ప్ర‌జ‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -