Friday, April 26, 2024
- Advertisement -

‘మహర్షి’ డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాబు తనయుడు

- Advertisement -

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం గా ‘మహర్షి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో వసూళ్లు నమోదు చేసుకోలేకపోయింది. సినిమా హిట్ అయినా లేకపోయినా మహేష్ బాబు మరియు వంశీ పైడిపల్లి మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారిపోయారు. తాజాగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వంశీపైడిపల్లి తదుపరి సినిమాలో గౌతమ్ ఘట్టమనేని హీరోగా నటిస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి మహేష్ బాబు కూడా ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నే ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తన తనయుడు గౌతమ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రతిభ చాటనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో గౌతమ్ కనిపించాడు. ఇప్పుడు గౌతమ్ ముఖ్య పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందని ఈ సినిమాలో మహేష్ బాబు కీలక పాత్ర లో కనిపిస్తారని సమాచారం. మరోవైపు వంశీ కూతురు ఆద్యా మరియు మహేష్ బాబు కూతురు సితార కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయి యూట్యూబ్ లో ఒక ఛానల్ ని సైతం క్రియేట్ చేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -