Friday, April 26, 2024
- Advertisement -

బాబు ఇంకా ఆ ఆద్దె ఇంట్లో ఎందుకున్నారో..అదే నేనైతే … సుజనా చౌదరి

- Advertisement -

భాజాపా ఎంపీ సుజనా చౌదరి వైసీపీ, టీడీపీపై సెటైర్లు వేశారు. రెండు పార్టీలు దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని వ్యంగ్యస్త్రాలు సంధించారు. జగన్ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరల్లలో పారదర్శకత లేదన్నారు.రివర్స్ టెండరింగ్‌లో కేవలం ఒకే ఒక్క కంపెనీ పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కనీసం ఇద్దరు కూడా లేకుండా రివర్స్ టెండరింగ్ అంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వివాదంపై కూడా సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అద్దె కొంప అయినపుడు ఆ ఇంట్లో బాబు ఎందుకున్నారో అర్థం కావడంలేదన్నారు. అదే నేనయితే వెంటనే ఖాలీ చేసేవాడినన్నారు.చంద్రబాబు ఇంకా ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నారో తనకు అర్థంకావడం లేదని సుజనా చౌదరి అన్నారు.

అద్దె ఇంట్లో సమస్య వస్తే అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే బాగుంటుందని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -