Friday, April 26, 2024
- Advertisement -

ప్లెక్సీ పై స్పందించిన ర‌ష్మి…

- Advertisement -

జబర్దస్త్’ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ .. రష్మీ ఎంతో పాప్యులర్ అయ్యారు. ఈ క్రేజ్ కారణంగా ఈ ఇద్దరూ మరికొన్ని షోలలోను సందడి చేస్తుంటారు. రష్మీకి గ్లామర్ కూడా కలసి రావడంతో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది. గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్ చేసి మెప్పించింది. రష్మీకి యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది.

జబర్దస్త్ షోలనే సుధీర్, రష్మీ మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటుంటాయి. దీనితో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి గాను, తిరుపతిలో కొందరు ఈ నెల 9వ తేదీన 10k రన్ ను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీ హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు ర‌ష్మి.

ఈ ఈవెంట్ కి సంబంధించిన నిర్వాహకులు ఎవరూ ఇంతవరకూ నన్ను సంప్రదించలేదు. ఈ ఈవెంట్ కి నేను రానున్నట్టుగా జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నా అనుమతి లేకుండా నా ఫోటోని ఎలా ఉపయోగిస్తారు? నిర్వాహకులు వెంటనే నా ఫ్లెక్సీని తొలగించాలి” అంటూ ఆమె సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -