Friday, April 26, 2024
- Advertisement -

పుల్వామా ఘ‌ట‌న‌నేప‌థ్యంలో ఢిల్లీలో అఖిప‌క్ష‌భేటీ…..

- Advertisement -

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడిపై యావ‌త్ దేశం అంతా ముక్త‌కంఠంతో ఖండిస్తోంది. యావ‌త్ భార‌తావ‌ని అంతా ఉగ్ర‌వాద‌రాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వానికి దేశంలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాలు మ‌ద్తుతు ప‌లికాయి. దీనిలో బాగంగానే ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రుగుతోంది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పేందుకు వీలుగా అభిప్రాయ సేకరణకు హోంశాఖ సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఏం చర్యలు తీసుకోవాలన్న విషయమై రాజకీయ పక్షాల నుంచి సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఈస‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని యావ‌త్ భార‌తావ‌ని ఎదురుచూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -