Sunday, April 28, 2024
- Advertisement -

మేడిగడ్డ వ్యయం పెరిగిందా కాగ్ ఏమన్నదీ?

- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజి. ఈ బేరేజి నిర్మాణం ఖర్చు మొదట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా మధ్యలో పనులలో మళ్ళీ సర్దుబాట్లు చేయటం వల్ల 2472 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడింది. ఆగస్టు 2016న తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం ఒక కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఒప్పందం విలువ రూ 1849.31 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం బ్యారేజి నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ పనులు చేసే క్రమంలో అందులో చేసిన మార్పులు చేర్పుల వల్ల ఒప్పందంలో పేర్కొన్న ధరను 4321.44 కోట్లకు పెంచారు. అంటే ఈ పనుల విలువ పెంచటం వల్ల ధర లో వచ్చిన వ్యత్యాసం రూ 2472.13 కోట్లు.

2019లోనే దెబ్బతిన్న మేడిగడ్డ

ప్రాజెక్ట్ లింక్ 1 లో మేడిగడ్డ, అన్నారం, సుందళ్లలో మూడు కొత్త బ్యారేజీలు నిర్మించారు. ఆగస్టు 2016 లో మొదలు పెడితే ఈ మూడు బేరేజిలు జూన్ 2019 నాటికి పూర్తి అయ్యాయి. మేడిగడ్డ 80000 క్యూసెక్కులు వరద డిశ్చార్జ్ చేసే సామర్ధ్యంతో నిర్మించారు. అన్నారం 65000 క్యూసెక్కులు, సుందిళ్ల 57000 క్యూసెక్కులు డిశ్చార్జ్ చేస్తాయి. బేరేజిల డిజైన్లు, వాటికీ సంబంధించిన ఇతర నిర్మాణాలు ఐ అండ్ కేడ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు.

2019 నవంబరులో వచ్చిన వరద కు బేరేజిల గేట్లు తెరిచి వరదను కిందకు వదిలారు. అనంతరం గేట్లు మూసిన తరువాత బ్యారేజీల్లో కొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయాయి. ఆర్సీసీ వేరింగ్ కోట్, సీసీ కర్టెన్ వాల్స్ లో కొంత భాగం, బేరేజి దిగువ భాగంలో నిర్మించిన సీసీ బ్లాక్స్ వరదలో కొట్టుకుపోయాయి. దీనివల్ల వాటిల్లిన నష్టం రూ 180.39 కోట్లు.

వరద ఉధృతికి ఈ నిర్మాణాలు కొట్టుకుపోయాయని, ఆ ఉధృతిని తట్టుకునే సామర్ధ్యంతో వాటిని నిర్మించలేదని డిపార్ట్మెంట్ చేపట్టిన స్టడీ లో తేలింది. ఈ డామేజి ని సవరించాలంటూ నిర్మాణ ఏజెన్సీలను డిపార్ట్మెంట్ సంప్రదించింది. కానీ కాంట్రాక్టు ఏజెన్సీలు అందుకు తిరస్కరించాయి. డిపార్ట్మెంట్ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే తాము వాటిని నిర్మించామని ఏజెన్సీలు పేర్కొన్నాయి. పైగా వాటికి క్వాలిటీ సెర్టిఫికెట్లు కూడా ఇచ్చారని చెప్పాయి. తరువాత మరికొన్ని పరిశీలనలు, స్టడీలు జరిపిన తరువాత వీటి పునరుద్ధరణ కోసం డిపార్ట్మెంట్ రూ 476.03 కోట్ల తో అంచనాలు రూపొందించింది.

లాంచింగ్ ఆప్రాన్, సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ ను లోపభూయిష్టమైన డిజైన్లతో నిర్మించటం వల్లనే అవి వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దానివల్ల వాటిల్లిన నష్టం 180.39 కోట్లు, దానికి అదనంగా మరమ్మతు ఖర్చు 476.03 కోట్లు.

ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ నిబంధనల ప్రకారం హెడ్ వర్క్స్ ఖర్చు లో ఒక శాతం మెయింటెనెన్స్ కు ఖర్చు పెట్టాలి. ఇది ఒక ఏడాదికి అయ్యే ఖర్చు. ఏడాదికి అయ్యే ఖర్చును తగ్గించటానికి డిపార్ట్మెంట్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఒప్పందాల విలువల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఖర్చు రూ 4550.40 కోట్లు. ఇది పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏడాదికి ఈ మూడు బ్యారేజీల హెడ్ వర్క్స్ నిర్వహణ వ్యయం మొత్తం రూ 45 కోట్లు మాత్రమే.

సీనరేజి, రాయల్టీ చార్జీలలోను అధిక చెల్లింపులు:

నిర్మాణ సామాగ్రి కొనుగోలులో కాంట్రాక్టర్ చెల్లించిన సీనరేజి చార్జీలను అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వం రీయింబర్సు చేస్తుంది. ఆ ప్రకారం మర్చి 2020 న కాంట్రాక్టరుకు రూ 73.23 కోట్లు ప్రభుతం చెల్లించింది.

బేరేజి నిర్మాణంలో కొంత భాగం మహారాష్ట్రలో ఉంది. అక్కడ చేపట్టిన నిర్మాణంలో వాడిన 4.71 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కు ప్రభుత్వం చెల్లించిన రాయల్టీ చార్జీలు రూ 14.63 కోట్లు కూడా ఈమొత్తంలో కలిసి వుంది.

ఆ ఇసుకకు డిపార్ట్మెంట్ రూ 880 / brass 108 రేటు చొప్పున రేయింబర్సు చేసింది. దీనికి అదనంగా 10 శాతం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కూడా చెల్లించింది. కానీ మర్చి 2015 న మహారాష్ట్ర రెవిన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇసుకమీద రాయల్టీ చార్జీలు రూ 400 / brass మాత్రమే.

ఎటువంటి ధ్రువీకరణ లేకుండా మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా కలెక్టర్ పంపిన డిమాండ్ నోటీసు ఆధారంగా ప్రభుత్వం ఇసుక రాయల్టీ చెల్లించింది. అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ధరల ప్రకారం ఆ జిల్లా కలెక్టర్ ఈ డిమాండ్ నోటీసు తయారు చేసారు. దీనివల్ల రాయల్టీ చార్జీలలో ప్రభుత్వం పై పడిన అదనపు భారం 7.32 కోట్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -