Friday, April 26, 2024
- Advertisement -

చ‌ర్చ‌లొద్దు…యుద్ధ‌మే…. ఉగ్ర‌దాడిపై క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఫైర్‌

- Advertisement -

జ‌మ్మూ, కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించారు క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్‌. ఈ దాడిలో దాదాపు 40 మంది జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. ఇక మాటల్లేవని యుద్ధమేనంటూ ట్వీట్ చేశారు. గంభీర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఈ దాడిపై స్పందించారు.

వేర్పాటువాదులతో మాట్లాడాలి. అవును, పాకిస్థాన్‌తో చర్చించాలి. కానీ ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడటం కాదు. యుద్ధ భూమిలోకి దిగి సమాధానం చెప్పే సమయం వచ్చింది. జరిగింది చాలు. శ్రీనగర్-జమ్మూ హైవేలో జరిగిన దాడిలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు’ అని గంభీర్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -