- Advertisement -
జమ్మూ, కాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఈ దాడిలో దాదాపు 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఇక మాటల్లేవని యుద్ధమేనంటూ ట్వీట్ చేశారు. గంభీర్తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఈ దాడిపై స్పందించారు.
వేర్పాటువాదులతో మాట్లాడాలి. అవును, పాకిస్థాన్తో చర్చించాలి. కానీ ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడటం కాదు. యుద్ధ భూమిలోకి దిగి సమాధానం చెప్పే సమయం వచ్చింది. జరిగింది చాలు. శ్రీనగర్-జమ్మూ హైవేలో జరిగిన దాడిలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు’ అని గంభీర్ పేర్కొన్నారు.