Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణలో కరోనా జోరు.. కొత్తగా 2,176 కరోనా కేసులు!

- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు ఎన్ని అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బులెటిన్లో చూపిస్తున్న సంఖ్యకు వాస్తవ సంఖ్యకు మధ్య తేడాలు వస్తున్నాయని ప్రతిపక్ష నేతల వాదన. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,176 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

మొత్తం మరణాల సంఖ్య 1070కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,004 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,48,139గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,929 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 26,84,215 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా మరియు రికవరీ రేటు 81.42 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే.. జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 308, రంగారెడ్డి 168, మేడ్చల్ 151, నల్గొండ 136, కరీంనగర్ 120, సిద్ధిపేట్ 95, భద్రాద్రి 88, ఖమ్మం 86, సూర్యపేట్ 82, వరంగల్ అర్బన్ 77, మహబూబా బాద్ 68, నిజామాబాద్ 68, సంగారెడ్డి 67, సిరిసిల్ల 56 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం.. కొత్త‌గా 86,052 పాజిటివ్ కేసులు

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్యం విషమం!

జంటనగరవాసులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన సిటీ బస్సులు

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కరోనా పాజిటీవ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -